CTR: సుస్ధిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై సదుం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన గ్రామం, ఈ-గవర్నెన్స్ తదితర తొమ్మిది అంశాలపై వార్డు, ఎంపీటీసీ సభ్యులకు శిక్షణ ఇచ్చినట్లు ఎంపీడీవో రాధారాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.