KMM: సత్తుపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కూకలకుంట రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సాధు కృష్ణయ్య, కోశాధికారిగా కేశవరెడ్డితో పాటు పలువురు ఇతర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కొత్త కార్యవర్గం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏడాది పాటు విధుల్లో కొనసాగనుంది.