CTR: రాష్ట్రంలో అర్హత గల నిరుపేదలకు టిడ్కో గృహాలు, పక్కా ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామా నాయుడు మంగళవారం డిమాండ్ చేశారు. ఇందుకోసం చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈనెల 24న ధర్నా నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.