RR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 15,16వ వార్డుల్లో నిర్వహించిన శానిటేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. అనంతరం ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.