JN: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుతూ లింగాల గణపురం తహసీల్దార్ కు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ వెంటనే అమలు చేసి ప్రజాసంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.