WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని 10వ వార్డులో జరుగుతున్న సైడ్ డ్రైనేజ్ పనులను మంగళవారం కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ పరిశీలించారు. ప్రభుత్వ నియమాలు పాటిస్తూ నాణ్యతతో కూడిన పనులు నిర్వహించాలని అధికారులను కోరారు. ప్రజలకు సౌకర్యవంతమైన వసతులు అందించే దిశగా మున్సిపాలిటిలో పనులు చేపట్టాలని సూచించారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు.