BDK: జిల్లా కలెక్టర్ అంకిత్ శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, రవాణా సౌకర్యాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏరియా ఆసుపత్రిలో 30 ప్రత్యేక పడకలను అందుబాటులో ఉంచాలని, ఐటీసీ (ITC) ఆధ్వర్యంలోని బ్రిడ్జ్ లైటింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.