WGL: దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.గోగుల రాణాప్రతాప్ తెలిపారు. నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం దుర్గమ్మ తల్లి గుడిపండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, నాయకుల ఆహ్వానం మేరకు రాణాప్రతాప్ ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసారు.