SS Rajamouli: రాజమౌళి కోరిక తీరింది..కానీ భయపెట్టేశాడు!
దర్శక ధీరుడు రాజమౌళి(ss rajamouli) అంటే ఇప్పుడో బ్రాండ్. ఆయన ఏం చేసినా సెన్సేషనే. బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాదులు వేసిన రాజమౌళి.. ట్రిపుల్ ఆర్తో ఇండియన్ సినిమాను ఆస్కార్ రేంజ్కు తీసుకెళ్లాడు. అయితే రాజమౌళికి కూడా కొన్ని తీరని కోరికలు ఉంటాయి. తాజాగా అందులో ఓ కోరిక తీరిపోయిందని చెప్పిన జక్కన్న.. అభిమానులను భయపెట్టినంత పని చేశాడు.
దర్శక ధీరుడు రాజమౌలి(ss rajamouli), ప్రభాస్(prabhas) కలిసి పాన్ ఇండియా లెవల్లో చేసిన ‘బాహుబలి’ సిరీస్కు విదేశాల్లో చాలా అరుదైన గౌరవాలు దక్కాయి. లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాను 2019లో ప్రదర్శించారు. రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించిన మొట్టమొదటి ఇంగ్లిషేతర సినిమా ఇదే. అయితే, ఇప్పుడు బాహుబలి సినిమాను నార్వేలోని మరో ప్రతిష్టాత్మక థియేటర్ స్టెవేంగర్ ఒపేరా హౌస్లో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు రాజమౌళి. ఈ సందర్భంగా రాజమౌళి, రమా రాజమౌళి, రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డ అక్కడకు వెళ్లారు. ఇక పనిలో పనిగా నార్వే దేశంలో గల పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. అయితే రాజమౌళి ఎప్పటి నుండో పల్ఫిట్ రాక్ని సందర్శించాలని అనుకుంటున్నారట.
‘మగధీర సినిమా కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ పల్పిట్ రాక్ ఫొటోలు చూశాను. అప్పటి నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటున్నాను. స్టావెంజర్లో జరగనున్న ‘బాహుబలి’ ఫిల్మ్ కన్సర్ట్కు ధన్యవాదాలు చెప్పాలి. దాని కారణంగానే ఎట్టకేలకు ఈ ప్రాంతాన్ని సందర్శించగలిగాను అని, అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా(social media)లో షేర్ చేసుకున్నాడు రాజమౌళి. అయితే రమా రాజమౌళి ఎంజాయ్ చేస్తున్న ఆ ఫొటోలు చూసి అభిమానులు కాస్త భయపడుతున్నారు. వారు ఎడ్జ్లో కూర్చొని ఉండడంతో.. జాగ్రత్త జక్కన్న, మరి ఎత్తైన కొండల అంచున సాహసాలు చేయకని.. కామెంట్స్(comments) చేస్తున్నారు. ఇకపోతే.. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో హాలీవుడ్ రేంజ్ మూవీ చేయబోతున్నాడు జక్కన్న. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.