AKP: నర్సీపట్నంలో శ్రీ నూకాలమ్మ జాతరను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం టౌన్ సీఐ షేక్ గఫూర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రి గరగలు, స్టేజ్ ప్రోగ్రాములు జరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నూకాలమ్మ ఆలయం వద్ద మహిళా భక్తుల భద్రత మీద దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.