MBNR: రంజాన్ పండుగ సందర్భంగా మంగళవారం పట్టణంలోని పేద ముస్లిం సోదరులకు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మమత శ్రీనివాస్ నూతన దుస్తులను పంపిణీ చేసి సహాయ హస్తం అందించారు. ప్రతి ఏడాది ముస్లింలకు పవిత్రమైన రంజాన్ పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకునేలా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.