E.G: ఇమామ్, మౌజన్లకు రంజాన్ సందర్భంగా ప్రభుత్వం గౌరవవేతనలు విడుదల చేయడం పట్ల మండపేట టీడీపీ ముస్లిం మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు షేక్ కరీం మెకానిక్ హర్షం వ్యక్తం చేశారు. మండపేట టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. CM చంద్రబాబు ఆదేశాలతో ఇమామ్ మౌజన్ల గౌరవ వేతనం నిమిత్తం రూ.45 కోట్లు విడుదల చేశారన్నారు.