MBNR: ప్రమాదంలో మరణించిన లేదా అపస్మారక స్థితిలో ఉన్న బాధితుల వద్ద ఉన్న నగలు, నగదును దోచుకుంటున్న ఇద్దరు వ్యక్తులను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 17 రాత్రి రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన పురుషోత్తం రెడ్డి మృతదేహంపై ఉన్న బంగారు నగలు కనిపించకపోవడంతో అతని సోదరుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నిందుతులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.