SKLM: జిల్లా అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 18వ తేదీన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి సభ్యులు హాజరుకావాలని ఆయన కోరారు.