KMM: రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు విస్తృతంగా అందుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం HYDలోని అసెంబ్లీలో తెలిపారు. ఒక కోటి 6 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలతో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రైతు భరోసా కింద రూ. 9 వేల కోట్లు అందించమన్నారు.