AKP: లాభదాయకమైన ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ గండి బాబ్జి సూచించారు. సోమవారం సబ్బవరం మండలం అమృతపురంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలన్నారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ యంత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు.