TPT: పుత్తూరు పట్టణoలో శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయంలో నిర్వహించిన శుభ వివాహ మహోత్సవంలో మాజీ మంత్రి రోజా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం తరఫున నూతనంగా నిర్మించిన 47 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకుని, అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.