NGKL: కోడేరు మండలంలో ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్తున్న పారిశుద్ధ్య కార్మికులను మంగళవారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. తమ వేతనాలను రూ.26,000కు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయడం సరికాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.