MHBD: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు మండల SI గిరిధర్ రెడ్డి హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇసుక రవాణాకు తహశీల్దార్ నుంచి అనుమతిపత్రం తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు.