KNR: రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని సర్పంచ్ వెల్మ బలరాం రెడ్డి సూచించారు. మంగళవారం పెగడపల్లి మండలం మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన ఉచిత టీకాల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పశువులకు టీకాలు వేశారు.