SRD: నిజాంపేట మండలం మాణిక్ నాయక్ తండ గ్రామంలో మహిళా సమైక్య భవనం నిర్మాణానికి సోమవారం సర్పంచ్ మంజుల శంకర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. స్థానికంగా మహిళ భవనం నిర్మాణానికి సెక్రటరీ సుమ భవన నిర్మాణానికి కొలతల ముగ్గును వేయించారు. మహిళల పొదుపు సంఘాల సమావేశాలు, స్వయం ఉపాధి అవకాశానికి ఉచిత శిక్షణ కార్యక్రమాలకు భవనం ఉపయోగపడుతుందన్నారు.