KRNL: కర్నూలు మం. దేవమాడ గ్రామంలో నిర్వహించిన రైతన్నా- మీకోసం, పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమంలో కోడుమూరు MLA దస్తగిరి పాల్గొన్నారు. రైతుల ఖాతాల్లో మూడవ విడత నిధులు జమ చేసిన సందర్భంగా డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయని పేర్కొన్నారు.