JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని టీఎస్ మోడల్ స్కూల్, కాలేజీలో, ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పెగడపల్లి మోడల్ స్కూల్లో ప్రభుత్వం మొదటిసారిగా ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి మార్చి 13 వరకు ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.