కడప: కాశీనాయన మండలంలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. ఉప్పలూరు నుంచి నరసాపురానికి 10 మందికి పైగా కూలీలు ఆటోలు బయల్దేరారు.. నరసాపురం సమీపంలో కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలకు గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.