MDK: రామాయంపేట మండలంలో సోమవారం అంగన్వాడీ సిబ్బంది, మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అసెంబ్లీ సమావేశాలు నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో తెల్లవారుజాము నుంచి అంగన్వాడీ సిబ్బందిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులను వారు తీవ్రంగా ఖండించారు.