PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి 4వ వార్డులో కోతుల బెడద, సంచారం తీవ్రతరమైంది. కోతులను నిర్బంధించి, నివారించేందుకు వార్డు కౌన్సిలర్ మద్దికట్ల స్రవంతి గ్రామంలో కోతులు సంచరించే ప్రాంతంలో బోను ఏర్పాటు చేయించారు. మార్చి 12న గడిపెళ్లి మంగళ, 14న కొండ రాజయ్యపై కోతి మూకలు దాడి చేసి గాయపరచడంతో ఆసుపత్రి పాలయ్యారు. కోతుల బెడద లేకుండా చేస్తామన్నారు.