KMM: మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి మేరకు త్వరలోనే మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, మత్కేపల్లి మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. రఘునాథపాలెం రైతు వేదికలో ఆదివారం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద యంత్రాలను మంత్రి పంపిణీ చేశారు.