WNP: దేశంలో దాదాపు 15 ఏళ్ల తర్వాత నిర్వహించనున్న జన గణన-2027 అత్యంత ముఖ్యమైనదని, దీని ఆధారంగానే దేశ అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయని, అందువల్ల ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణకు ఆయన హాజరై జిల్లా చార్జ్ స్థాయి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.