విజయ్, రష్మిక పెళ్లిపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘గీత గోవిందం సినిమాకు మొదట నన్నే అడిగారు. కథ వినకముందు నో చెప్పా. కథ విన్న తర్వాత సినిమా చేయడానికి ఓకే చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు మిస్ అయింది. కానీ, ఆ మూవీ వల్ల విజయ్, రష్మిక కలిశారు. వాళ్లిద్దరూ కలవాలని ఆ సినిమా నా నుంచి వెళ్లిపోయిందేమో. ఆ ఇద్దరూ బ్యూటిఫుల్ కపుల్’ అని పేర్కొంది.