RR: శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని బీఆర్ఎస్ నేత మారబోయిన రవి యాదవ్ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో పేదల కోసం నిర్మించిన ఈ హాల్.. ప్రస్తుతం పిచ్చిమొక్కలు, ధ్వంసమైన విద్యుత్ పరికరాలు, అపరిశుభ్రతతో నిరుపయోగంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.