KMM: ఖమ్మం కలెక్టరేట్లో ఆదివారం జనగణన-2027కు సంబంధించిన 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని జనగణనను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మొదటి దశ ఇళ్ల జాబితా మే 11 నుంచి జూన్ 9 వరకు, రెండో దశ జనగణన ఫిబ్రవరి 2027లో జరుగుతుందని తెలిపారు.