VZM: రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ పథకంలో బాగంగా మూగజీవులకు దాహార్తి తీర్చేందుకు నీళ్ల కుండీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా కొత్తవలస మండలంలో ఉన్న పలు గ్రామాల్లో శనివారం నీళ్ల కుండీలను స్థానిక ఉపాధి హామీ పనుల కార్యక్రమ అధికారి జనార్ధనరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వేసవికాలంలో పశువులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.