వేసవి రాకముందే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న నందిగామ, కర్నూలులో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. విశాఖ, తుని, నరసాపురం, బాపట్ల తదితర ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.