JGL: కథలాపూర్ మండలంలోని ఊటుపల్లి గ్రామంలో వెలసిన మల్లికార్జున స్వామిని ఆదివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. జాతర ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాల లక్ష్మి, ఉప సర్పంచ్ శేఖర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.