ADB: హార్టికల్చర్ శాఖ ద్వారా రూ. 500 విలువచేసే కూరగాయల విత్తనాల కిట్లను ఈరోజు బోథ్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో 100% సబ్సిడీతో రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. కూరగాయలు పండించే రైతులు మాత్రమే ఈ కూరగాయల కిట్లకు అర్హులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్, ఏఈఓ ఆడెపు కృష్ణ పలువురు రైతులు పాల్గొన్నారు.