KMR: ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు డీఈవో రాజు తెలిపారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు మాత్రం, పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని స్పష్టం చేశారు.