వనపర్తి జిల్లా కేంద్రంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ వేడుక ముస్లిం సోదరుల ఐక్యతకు, స్నేహానికి నిదర్శనమని వారు కొనియాడారు.