TG: రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదో తరగతుల విద్యార్థులు ఏకంగా 68% మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. ఇందులో మొత్తం 42,25,256 మంది విద్యార్థులుండగా.. వారిలో 33,67,150 మంది ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం(యూడైస్) 2025-26 గణాంకాల ప్రకారం.. ఒకటో తరగతిలో 6.23 లక్షల మంది ప్రవేశాలు పొందగా.. 4.40 లక్ష మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు.