TG: మూసీ నది మురికిగా మారడంతో భూగర్భజలాలు కలుషితమయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. తద్వారా నల్గొండ జిల్లాలోని 30 లక్షల మంది ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మూసీ ప్రక్షాళన చేపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు.