HYD: మియాపూర్ హఫీజ్పేట్లోని ఆదిత్యనాథ్ ఇంపీరియల్ అపార్ట్మెంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఫిబ్రవరి 14న శ్వేత అక్కినపల్లి ఇంట్లో నగలు, నగదు మాయమవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఆధారంగా ఇంట్లో పనిచేసే మహిళే దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి 60 గ్రాముల బంగారం, 4 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.