PPM: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల రెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని కాంగ్రెస్ పార్టీ డీసీసీ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు తెలిపారు. శనివారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్వతిపురంలో విలేకరులతో మాట్లాడారు. రేపు కొమరాడ మండలం డంగ భద్రలో ఆమె పరిరక్షణ యాత్ర చేపట్టనున్నారు.