HNK: కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ లింగమూర్తి శనివారం మధ్యాహ్నం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న MLA KR నాగరాజు భీమారం బ్యాంకు కాలనీలోని మృతుడి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్థానిక కాంగ్రెస్ నేతలు ఉన్నారు.