PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని రెళ్ల గ్రామంలో నిర్మించనున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ప్రతిష్ట కోసం యాగశాల ముహూర్తం రాయిని ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యులు కడ్రక మల్లేశ్వరరావు, గ్రామ సర్పంచ్ మండంగి శంకరరావు చేతుల మీదుగా వేశారు. ఈ సందర్భంగా ప్రజలు దైవభక్తితో జీవించాలని మల్లేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.