AP: గిరిజనుల కష్టాలను చూసి రహదారుల నిర్మాణానికి ముందుకొచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి జిల్లా నందిగరువులో గిరిజనులతో ఆయన మాట్లాడుతూ.. ప్రజల కష్టాలను తీర్చేందుకే కూటమి ప్రభుత్వం ఉందని భరోసా ఇచ్చారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా.. తనతో పంచుకోవాలని కోరారు. సరైన రహదారి లేకుండా గిరిజనులు ఇబ్బంది పడుతుంటే చూసి తట్టుకోలేకపోయానన్నారు.