SRPT: జిల్లాలో శనివారం పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 69 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 12,355 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 12,342 మంది హాజరయ్యారు. 13 మంది గైర్హాజరయ్యారు. అధికారులు 37 కేంద్రాలను తనిఖీ చేశారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని, పరీక్షలు సజావుగా నిర్వహించామని జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ తెలిపారు.