NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ నందవరం చౌడేశ్వరి దేవి ఆలయ అధికారులు అర్చకులు కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఉగాది మహోత్సవాల ఆహ్వాన పత్రికను వారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి అందజేశారు. అనంతరం వారు మంత్రిని ఘనంగా సన్మానించారు.