ASR: అరకులోయలోని గిరిజన మ్యూజియం పర్యాటకుల రాక తగ్గడంతో వెలవెలబోతోంది. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతుండటంతో పర్యాటకుల సందర్శన గణనీయంగా తగ్గినట్లు మ్యూజియం సిబ్బంది తెలిపారు. సాధారణ రోజుల్లో సందర్శకులతో కిటకిటలాడే మ్యూజియం ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తోంది. అరకులోయలోని ఇతర పర్యాటక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.