GNTR: తెనాలిలో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శనివారం పర్యటించారు. రెవెన్యూ అధికారులతో కలిసి పన్ను బకాయిదారుల నివాసాలకు వెళ్లి మాట్లాడారు. మార్చి చివరి నాటికి ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో, ఇంటి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికి 75 శాతం వసూళ్లు పూర్తయ్యాయని, నెలాఖరు నాటికి 100% వసూళ్లు లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు.