AP: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పేదలకు భరోసా అని ఏపీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. పాకరావుపేటలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేపట్టిన పరిరక్షణ యాత్రలో భాగంగా మన్రేగా చట్టాన్ని పునరుద్ధరించాలి. గ్రామాల్లో పేదరికాన్ని రూపుమాపి, వలసలు నివారించిన పథకం ఇది. ఇలాంటి గొప్ప పథకాన్ని మోదీ చంపేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ఉపాధి లేకుండా ఊపిరితీస్తున్నారు’ అంటూ విమర్శించారు.