SKLM: పోలాకి మండలం పరిషత్ కార్యాలయంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి హాజరయ్యారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలుపై చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు సమస్య లేకుండా తగు చర్యలు చేపట్టాలని చూడాలని అధికారులను ఆదేశించారు.